మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను సద్వినియోగం చేసుకోవాలి
వెల్లడించిన జిల్లా కలెక్టర్..
కామారెడ్డి :
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ప్రజలకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పనుల జాతర కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సదాశివ నగర్ మండలంలోని తిమ్మాజివాడి గ్రామంలో పాల్గొని చాకలి ఎంకవ్వ గారి పశువుల షెడ్డు ప్రారంభించడం జరిగింది. పశువుల షెడ్డు సంబంధించిన పేమెంట్ ను చెక్కు రూపంలో అందజేసి పాడి పశువులను కలిగి ఉన్న రైతులు పశువుల షెడ్ల పథకంలో ఉపయోగించుకొని మరింతమంది పక్షుల షెడ్లను నిర్మించుకోవాలని సూచించారు.