ఏసీబీ వలలో చిక్కిన ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ సంయుక్త సబ్ రిజిస్టర్ శ్రీనివాస రెడ్డి...

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : 

WhatsApp Image 2025-08-22 at 6.06.08 PM

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రెడ్డి, డాక్యుమెంట్ రైటర్ ముద్దాసిర్ గిఫ్ట్ డిడ్ కోసం బాధితుడి నుండి రూ.5 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో, అధికారులు శుక్రవారం వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పూర్తి వివరాలను అధికారులు  త్వరలో వెల్లడించనున్నారు.

Read More పదే పదే నేరాలకు పాల్పడిన వారిపై గ్యాంగ్ ఫైల్స్ ఓపెన్ చేయాలి

ఫిర్యాదుదారుని భార్య పేరుమీద గల గృహాన్ని బహుమతి డీడ్ క్రింద రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారిక సహాయం చేస్తానని ₹5,000/- లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ సంయుక్త సబ్జజిస్ట్రార్ శ్రీనివాస రెడ్డి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం కోరినపుడు ప్రజలు వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ( ఏసీబీ)ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

Read More మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను సద్వినియోగం చేసుకోవాలి

ఎవరైనా లంచాలు అడిగితే.

Read More రైతులు కాళ్లు మొక్కే దుస్థితి కాంగ్రెస్ పాలనలోనే

టోల్ ఫ్రీ నెంబర్: 1064
వాట్సప్ నెంబర్ 9440446106
ఎక్స్ ట్విటర్ Telangana ACB
(Twitter): @TelanganaACB
వెబ్సైట్  acb.telangana.gov.in లో ఫిర్యాదు చేయవచ్చు.. ఫిర్యాదుదారుల / బాధితుల వివరాలను గోప్యంగా ఉంచబడుతాయి. అని అన్నారు. 

Read More వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఫోటో కాంపిటేషన్ విజేతలకు బహుమతులు

About The Author