వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఫోటో కాంపిటేషన్ విజేతలకు బహుమతులు
ఉమ్మడి వరంగల్ : ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్టాఫ్ ఫోటో జర్నలిస్టులకు నిర్వహించిన ఫోటో కాంటెస్ట్ విజేతలను న్యాయనిర్ణేతలు ప్రకటించారు. కేయూ జర్నలిజం విభాగధిపతి సంగాని మల్లేశ్వర్, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గాదె లింగమూర్తి, కేయూ పూర్వ పీఆర్వో వేదాంతం కృష్ణమాచారిలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి కాంటెస్ట్ కు వచ్చిన ఫొటోలను వడబోసి ఎంపిక చేశారు. ప్రతీ ఫోటోను క్షుణ్ణంగా పరిశీలించారు. కోడ్ నేమ్ ద్వారా ఫోటోలను ఎంపిక చేసిన తర్వాత పేర్లను ప్రకటించారు.
1. గోవర్థనం వేణుగోపాల్, సాక్షి, 2. సంపెట సుధాకర్, ఆంధ్రజ్యోతి. 3. పాలకుర్తి మధు, ఆంధ్రజ్యోతి.. 4. వీరగోని హరీష్, ఆంధ్రజ్యోతి. 5. ఆవుల సంపత్, ఈనాడు.. లకు కన్సోలేషన్ బహుమతులు దక్కాయి. ఇప్పటివరకు వరంగల్ లో ఫోటో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఎవరూ కాంపిటీషన్ పెట్టలేదని తమ కమిటీ ఫోటో జర్నలిస్టుల కోసం ఆలోచించి వారిని గౌరవించటం సముచితమని బావించి ఈ పని చేసిందని అన్నారు.
10:30 గంటలకు ప్రెస్ క్లబ్ లో “ ప్రపంచ ఫొటో గ్రఫీ దినోత్సవం సందర్బంగా నిర్వహించిన “ఫోటో కాంపిటీషన్” విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించనున్నామని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారం సదయ్య, కోశాధికారి బొల్ల అమర్ లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శాసన మండలి వైస్ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, శాసనమండలి సభ్యులు బస్వరాజు సారయ్య లు హజరౌతారని గౌరవ సభ్యులు హజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరారు. ముఖ్య అథిధుల చేతుల మీదుగా విజేతలకు బహుమతుల ప్రధానం జరుగుతుందని అన్నారు.