రాష్ట్రంలో మొదటిసారిా క్రెచ్ కేంద్రం ఏర్పాటు.

వెల్లడించిన మంత్రి సీతక్క.

WhatsApp Image 2025-08-18 at 6.47.07 PM

ములుగు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన క్రెచ్  కేంద్రాలు పిల్లల సంరక్షణ సేవలను అందించేందుకు,   పగటిపూట తమ పిల్లలను చూసుకోలేని తల్లిదండ్రులు  కేంద్రాలను ఉపయోగించుకోవాలని 
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.

Read More తిప్పాపూర్‌లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

సోమవారం ములుగు మండలం జగన్నపేట గ్రామంలో  రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి అంగన్వాడి  డే కేర్ కేంద్రం   ప్రారంభోత్సవం చేశారు.

Read More వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఫోటో కాంపిటేషన్ విజేతలకు బహుమతులు

అనంతరం అంచనా 15 లక్షల నిధులతో అంగన్వాడి భవన నిర్మాణ పనులకు  శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, సరైన క్రెచ్ కేంద్రాలు లేకపోవడం తో తరచుగా, మహిళలు బయటకు వెళ్లి పని చేయడానికి ఇబ్బందిగా  మారిపోయిందని,  తమ పిల్లలకు సరైన పిల్లల సంరక్షణ మరియు రక్షణ కల్పించడంలో పనిచేసే తల్లులు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులను పరిష్కరించడానికి, పల్నా పథకం ద్వారా డే-కేర్/క్రష్ కేంద్రాలు ఉపయోగపడుతాయని తెలిపారు. 7 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు సురక్షితమైన వాతావరణంలో నాణ్యమైన క్రెచ్ సౌకర్యాలను అందించబడుతాయని  పోషకాహారo, పిల్లల ఆరోగ్యం, పెరుగుదల పర్యవేక్షణ వంటి సేవలు డే-కేర్/క్రెచ్ కేంద్రాలు అందిస్తాయని తెలిపారు.ములుగు జిల్లా లో ములుగు, తాడ్వాయి, ఏటూరునాగారం వెంకటాపురం (04) ఐ సి డి ఎస్ ప్రోజెక్టుల పరిధిలో  పల్నా పథకం ద్వారా 25 డే-కేర్/క్రెచ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని,  తల్లి తండ్రులు ఈ కేంద్రాలను ఉపయోగించు కోవాలని  సూచించారు. 

Read More ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహణలో నిబంధనలు తప్పకుండా పాటించాలి ....

ఈ కార్యక్రమం లో  జాయింట్ డైరెక్టర్,  మహిళా, శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్  వినోద్,  ఆర్డీఓ వెంకటేష్, జిల్లా సంక్షేమ అధికారి  టి. రవి,  తెలంగాణ స్టేట్ లీడర్ మొబైల్ క్రెచ్ మాణికప్ప, ప్రోగ్రాం ఆఫీసర్ మొబైల్ క్రెచ్,  రాంప్రసాద్,   సీడీపీఓ ములుగు  కె.శిరీష, ఐ సి డి ఎస్ సూపర్ వైజర్, అంగన్వాడీ టీచర్స్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, విద్యార్థులు, తదితరులు తదితరులు పాల్గొన్నారు.

Read More సైబర్ మోసాలకు గురై పోగొట్టుకున్న నగదు బాధితులకు రీఫండ్ చేసే వరకు పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టాలి

About The Author