అభివృద్ధి పనులను జాతరలా ప్రారంభించన కలెక్టర్
ఏటూర్ నాగారం/ములుగు జిల్లా :

వివిధ రకాల అభివృద్ధి పనులను చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని
శుక్రవారం ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామపంచాయతీలో పనులను జాతరలా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు తో కలిసి ఘనంగా ప్రారంబించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకానికి ( ఎంజీఎంఆర్ఈజీఎస్) సంబంధించి మొత్తం 266 పనులు చేపట్టబడి ఉన్నాయని, వాటిని గ్రామ ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి కార్మికుడు రోజుకు రూ. 307 లబ్ధి పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.
గ్రామంలో ప్రతి కుటుంబానికి చెందిన సభ్యులు జాబ్ కార్డు వినియోగించుకొని ఉపాధి హామీ పథకం ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నారు. కొత్తగా ఎవరికైనా పనులు కావలసిన సందర్భంలో, సంబంధిత అధికారులు అవసరమైన సహాయం అందిస్తారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎం పి డి ఓ శ్రీనివాస్, ఎం పి ఓ, ఏ పి ఓ, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
