ఉస్మాన్ నగర్ బీఈమ్యాక్ సొసైటీ ప్రజలకు ఇంప్రూవ్మెంట్ చార్జీలు తగ్గించండి

జలమండలి ఎండి అశోక్ రెడ్డిని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్..

ఉస్మాన్ నగర్ బీఈమ్యాక్ సొసైటీ ప్రజలకు ఇంప్రూవ్మెంట్ చార్జీలు తగ్గించండి

రామచంద్రాపురం:

తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఉస్మాన్ నగర్ లో గల బిహెచ్ఇఎల్ బీఈమ్యాక్ సొసైటీ కాలనీవాసులకు మంచినీటి కనెక్షన్ల కోసం వసూలు చేస్తున్న ఇంప్రూవ్మెంట్ చార్జీలను తగ్గించాలని కోరుతూ జలమండలి ఎండి అశోక్ రెడ్డిని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు..

సోమవారం హైదరాబాద్లోని జలమండలి కార్యాలయంలో ఎండి అశోక్ రెడ్డితో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో జలమండలి ద్వారా చేపడుతున్న మంచినీటి సరఫరా, రిజర్వాయర్లు, నూతన కనెక్షన్లపై చర్చించారు. 

ప్రధానంగా తెల్లాపూర్  డివిజన్ పరిధిలోని ఉస్మాన్ నగర్ లో బిహెచ్ఎల్ పరిశ్రమలో విధులు నిర్వర్తించి.. రిటైర్మెంట్ అయిన అనంతరం బిఈమెక్ సొసైటీ పేరుతో గృహాలను నిర్మించుకొని జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇటీవల మంచినీటి కనెక్షన్ల కోసం జలమండలికి దరఖాస్తు చేసుకోగా.. మూడు కోట్ల రూపాయలు చెల్లించాలని ఇందులో 64 లక్షల రూపాయలు ఇంప్రూవ్మెంట్ చార్జీలు కట్టాలని నోటీసులు అందజేశారని తెలిపారు. ఇప్పటికే మూడు కోట్ల రూపాయలను డిడి రూపంలో జలమండలికి చెల్లించడం జరిగిందని తెలిపారు.  ప్రస్తుతం కాలనీలో అత్యధిక శాతం ఉద్యోగ విరమణ పొందిన కార్మికులు నివసిస్తున్నారని.. ఇంప్రూవ్మెంట్ చార్జీలు చెల్లించే ఆర్థిక పరిస్థితులు వారికి లేవని ఆయన తెలిపారు. మానవత దృక్పథంతో ఇంప్రూవ్మెంట్ చార్జీలను రద్దుచేసి నల్ల కనెక్షన్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎండి అశోక్ రెడ్డి అతి త్వరలో వీటికి సంబంధించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. 

ఈ సమావేశంలో మాజీ ప్రజా ప్రతినిధులు ఉమేష్,   బీఈమ్యాక్ అధ్యక్షులు సంజీవ్ ప్రసాద్, ఉపాధ్యక్షులు మాధవరావు, సంయుక్త కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, ప్రతినిధులు వాసుదేవరావు, సందీప్ రెడ్డి, సూర్య తదితరులు పాల్గొన్నారు.

About The Author