నేటి భారతం

అందరూ మనవాళ్లే అనుకోవడంలో
ఎలాంటి తప్పు లేదు..
కానీ అందరూ మనలాంటి వాళ్ళే అనుకోవడం
మాత్రం పొరబాటు..
నువ్వు నీలా ఉండాలనుకోవడం సహజం..
అందరూ నీలా ఉండాలనుకోవడం స్వార్ధం..
ఎవరి మనస్తత్వాలు వాళ్ళవి..
ఎవరి మనోభావాలు వాళ్ళవి..
ఎదుటివారిని నిందించకూడదు..
ఎదుటివారిని విమర్శించకూడదు..
ఎందుకంటే మనగురించి వారుకూడా
మీలాగే ఆలోచిస్తారు కనుక..
అందుకే అంటారు తానొవ్వక, నొప్పించక,
తప్పించుకు తిరుగువాడే ధన్యుడు అని..
About The Author
13 Jun 2026
