బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు లాగులు తడిశాయి : బిఆర్ఎస్ నగర అధ్యక్షులు హరిశంకర్ పైర్
కరీంనగర్, మార్చి 25(భారత శక్తి): కరీంనగర్ ఉమ్మడి జిల్లా బిఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం, కేటీఆర్ ర్యాలీనీ చూసి కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులకు లాగులు తడిసినాయని నగర పార్టీ అధ్యకులు చల్ల హరిశంకర్ ఆరోపించారు. కేటీఆర్ ను విమర్శించే స్థాయి సునీల్ రావు కు లేదనీ, ఆయన కాలిగోటికి కూడా సరిపోవని మండిపడ్డారు. మంగళవారం మంకమ్మతోటలోని క్యాంపు కార్యాలయంలో నగర కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, యూత్ ప్రధాన కార్యదర్శి బోనకూరి సాయికృష్ణ, నాయకులు ఏడబోయిన శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరిశంకర్ మాట్లాడుతూ సునీల్ రావుకు మేయర్ పదవి, ఆ హొదానీ కల్పించింది బి ఆర్ ఎస్ పార్టీ అని, అధికారం కోసం జోకే చరిత్ర సునీల్ రావుదని ఎద్దేవా చేశారు. మేయర్ పదవిని దొడ్డిదారిన పొంది కోట్లు సంపాదించిన ఘనత సునీల్ రావుకు దక్కిందన్నారు. కరీంనగర్ రాజకీయాల్లో ఉసర వెళ్ళిగా సునీల్ రావుకు పేరుందనీ చెప్పారు. ఊసర వెళ్లి సునీల్ రావు పట్ల బండి సంజయ్ జాగ్రత్త గా ఉండాలనీ సూచించారు.. అత్యంత అవినీతి పరుడు ఎవరని గూగుల్ లో వెతికితే సునీల్ రావు పేరు వస్తుందనీ ఆరోపించారు.ఉడుం సొచ్చినట్లు బీజేపీ లో సొచ్చిండనీ.. బీజేపీ నాయకులు జాగ్రత్తగా ఉండాలనీ చెప్పారు. బిఆర్ఎస్ నేతలను విమర్శిస్తే ఖబడ్దార్… సునీల్ రావు నీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.స్మార్ట్ సిటీ లో బండి సంజయ్ పాత్ర లేదని బి.అర్.ఎస్ లో ఉన్నప్పుడు విమర్శించిన విషయం సునీల్ రావు మరిచి పోయావా అని గుర్తు చేశారు కరీంనగర్ అభివృద్ధి మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి తోనే సాధ్యమైందనీ చెప్పారు. బి.అర్.ఎస్ ప్రభుత్వ హయంలోనే కరీంనగర్ అన్నివిధాల అభివృద్ధి చెందిన విషయం మంత్రి పొన్నం ప్రభాకర్ గమనించాలనీ కోరారు. 15 నెలల కాలంలో మంత్రిగా పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కు ఏం చేశారో చెప్పాలి. తమ హయంలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఎక్కడికక్కడ ఆగిపోయిందనీ అన్నారు.కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక కార్పొరేటర్ లా మాట్లాడారాని చెప్పారు . కెసిఆర్ కు దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉంది అన్న విషయం బండి సంజయ్ కు ఎలా తెలిసింది… అందులో పని చేశారా అని అడిగారు.రేవంత్ రెడ్డి దగ్గర మెప్పు పొందేదుకే బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారనీ, బండి సంజయ్ కు దమ్ముంటే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల మీద మాట్లాడాలనీ మండిపడ్డారు.కెసిఆర్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీ కలిసి డైవర్షన్ డ్రామాలు చేస్తున్నారనీ ఆరోపించారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నగర మైనార్టీ అధ్యక్షులు షౌకత్, నగర విద్యార్థి విభాగం అధ్యక్షులు బొంకూరి మోహన్, యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, పార్టీయూత్ మైనార్టీ అధ్యక్షులు నవాజ్, చేతి చంద్రశేఖర్, ఆరె రవి గౌడ్ జెల్లోజి శ్రీనివాస్, కొత్త అనిల్ కుమార్, రాజేందర్, దుడెల్ల ప్రశాంత్, కర్రే అనిల్, నారదాసు వసంతరావు, మెరుగు శ్రీనివాస్, ఉమాశంకర్, ఒడ్నాల రాజు, సతినేని శ్రీనివాస్, గూడెల్లి రాజ్ కుమార్, మంచి కట్ల కిషోర్ నరసింగరావు, నయీమ్ గంటల రేణుక లుపాల్గొన్నారు.
కరీంనగర్, మార్చి 25(భారత శక్తి):
కరీంనగర్ ఉమ్మడి జిల్లా బిఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం, కేటీఆర్ ర్యాలీనీ చూసి కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులకు లాగులు తడిసినాయని నగర పార్టీ అధ్యకులు చల్ల హరిశంకర్ ఆరోపించారు. కేటీఆర్ ను విమర్శించే స్థాయి సునీల్ రావు కు లేదనీ, ఆయన కాలిగోటికి కూడా సరిపోవని మండిపడ్డారు. మంగళవారం మంకమ్మతోటలోని క్యాంపు కార్యాలయంలో నగర కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, యూత్ ప్రధాన కార్యదర్శి బోనకూరి సాయికృష్ణ, నాయకులు ఏడబోయిన శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరిశంకర్ మాట్లాడుతూ సునీల్ రావుకు మేయర్ పదవి, ఆ హొదానీ కల్పించింది బి ఆర్ ఎస్ పార్టీ అని, అధికారం కోసం జోకే చరిత్ర సునీల్ రావుదని ఎద్దేవా చేశారు. మేయర్ పదవిని దొడ్డిదారిన పొంది కోట్లు సంపాదించిన ఘనత సునీల్ రావుకు దక్కిందన్నారు.
కరీంనగర్ రాజకీయాల్లో ఉసర వెళ్ళిగా సునీల్ రావుకు పేరుందనీ చెప్పారు. ఊసర వెళ్లి సునీల్ రావు పట్ల బండి సంజయ్ జాగ్రత్త గా ఉండాలనీ సూచించారు.. అత్యంత అవినీతి పరుడు ఎవరని గూగుల్ లో వెతికితే సునీల్ రావు పేరు వస్తుందనీ ఆరోపించారు.ఉడుం సొచ్చినట్లు బీజేపీ లో సొచ్చిండనీ.. బీజేపీ నాయకులు జాగ్రత్తగా ఉండాలనీ చెప్పారు.
బిఆర్ఎస్ నేతలను విమర్శిస్తే ఖబడ్దార్… సునీల్ రావు నీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.స్మార్ట్ సిటీ లో బండి సంజయ్ పాత్ర లేదని బి.అర్.ఎస్ లో ఉన్నప్పుడు విమర్శించిన విషయం సునీల్ రావు మరిచి పోయావా అని గుర్తు చేశారు కరీంనగర్ అభివృద్ధి మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి తోనే సాధ్యమైందనీ చెప్పారు.
బి.అర్.ఎస్ ప్రభుత్వ హయంలోనే కరీంనగర్ అన్నివిధాల అభివృద్ధి చెందిన విషయం మంత్రి పొన్నం ప్రభాకర్ గమనించాలనీ కోరారు. 15 నెలల కాలంలో మంత్రిగా పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కు ఏం చేశారో చెప్పాలి. తమ హయంలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఎక్కడికక్కడ ఆగిపోయిందనీ అన్నారు.కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక కార్పొరేటర్ లా మాట్లాడారాని చెప్పారు .
కెసిఆర్ కు దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉంది అన్న విషయం బండి సంజయ్ కు ఎలా తెలిసింది… అందులో పని చేశారా అని అడిగారు.రేవంత్ రెడ్డి దగ్గర మెప్పు పొందేదుకే బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారనీ, బండి సంజయ్ కు దమ్ముంటే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల మీద మాట్లాడాలనీ మండిపడ్డారు.కెసిఆర్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీ కలిసి డైవర్షన్ డ్రామాలు చేస్తున్నారనీ ఆరోపించారు.
ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నగర మైనార్టీ అధ్యక్షులు షౌకత్, నగర విద్యార్థి విభాగం అధ్యక్షులు బొంకూరి మోహన్, యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, పార్టీయూత్ మైనార్టీ అధ్యక్షులు నవాజ్, చేతి చంద్రశేఖర్, ఆరె రవి గౌడ్ జెల్లోజి శ్రీనివాస్, కొత్త అనిల్ కుమార్, రాజేందర్, దుడెల్ల ప్రశాంత్, కర్రే అనిల్, నారదాసు వసంతరావు, మెరుగు శ్రీనివాస్, ఉమాశంకర్, ఒడ్నాల రాజు, సతినేని శ్రీనివాస్, గూడెల్లి రాజ్ కుమార్, మంచి కట్ల కిషోర్ నరసింగరావు, నయీమ్ గంటల రేణుక లుపాల్గొన్నారు.