ముఖ్యమంత్రి సహయ నిది చెక్కులను పంపిణి చేసిన ప్రభుత్వ విప్ ఆది
వేములవాడ,జూన్ 27 (భారత శక్తి) : వేములవాడ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో వేములవాడ అర్బన్, పట్టణ పరిదిలో అర్హులైన 76 మంది లబ్ధదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారాక్ ,18 లక్షల 80 వేల విలువ గల 54 ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కులను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్గా మారిందన్నారు. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి ప్రజా ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని చాటుకున్నారని తెలిపారు.అలాగే మన ప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వార, ఎల్ఓసిల ద్వారా ఇప్పటి వరకు 20 కొట్లు పై చిలుకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.అంతేకాకుండా పేదలకు వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.దేశంలోని అసమానతలు తొలగించి కుల మత భేదం లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఒక రోల్ మోడల్ గా కుల గణన చేసి నిలిచిందన్నారు..కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం జరుగుతుందన్నారు.వేములవాడ పట్టణాన్ని,రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నానని ఆయన తెలిపారు.
వేములవాడ,జూన్ 27 (భారత శక్తి) : వేములవాడ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో వేములవాడ అర్బన్, పట్టణ పరిదిలో అర్హులైన 76 మంది లబ్ధదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారాక్ ,18 లక్షల 80 వేల విలువ గల 54 ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కులను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్గా మారిందన్నారు. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి ప్రజా ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని చాటుకున్నారని తెలిపారు.అలాగే మన ప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వార, ఎల్ఓసిల ద్వారా ఇప్పటి వరకు 20 కొట్లు పై చిలుకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.అంతేకాకుండా పేదలకు వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.దేశంలోని అసమానతలు తొలగించి కుల మత భేదం లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఒక రోల్ మోడల్ గా కుల గణన చేసి నిలిచిందన్నారు..కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం జరుగుతుందన్నారు.వేములవాడ పట్టణాన్ని,రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నానని ఆయన తెలిపారు.