ములుగు పిఎసిఎస్ కు ఉత్తమ అవార్డు 

అవార్డు అందుకున్న చైర్మన్ బొక్క సత్తిరెడ్డి

ములుగు పిఎసిఎస్ కు ఉత్తమ అవార్డు 

ములుగు జిల్లా ప్రతినిధి, జులై 15 (భారత శక్తి) : హైదరాబాద్ లో జరిగిన నాబార్డ్ సంస్థ సదస్సులో ములుగు పిఎసిఎస్ సొసైటీకి ఉత్తమ అవార్డుకు ఎంపిక కాగా మంగళవారం హైదరాబాదులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిసిసిబి చైర్మన్, టెస్కా చైర్మన్ మార్నేని రవీందర్ రావు చేతుల మీదుగా ములుగు పిఎసిఎస్ చైర్మన్ బొక్క సత్తి రెడ్డి ఉత్తమ అవార్డును అందుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనంకొండ,ములుగు పిఎసిఎస్ సొసైటీలు ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యాయి. అందులో ములుగు పిఎసిఎస్ సొసైటీకి ఉత్తమ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, మంత్రి సీతక్క ఆశీస్సులు ఉండడం వల్లనే ఈ అవార్డు అందుకోవడం జరిగిందని, మాతోటి పిఎసిఎస్ పాలకవర్గానికి, వైస్ చైర్మన్,డైరెక్టర్లకు, తమకు సహకరించిన ములుగు మండల పరిధిలోని రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేసారు.

About The Author

Advertisement

Bharatha Sakthi Read Epaper Online

Latest News

ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
వైయస్సార్ కడప జిల్లా, జులై 15(భారత శక్తి) : పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అన్ని...
పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి
పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది
దళితులభూముల కబ్జా, వివక్షత, హక్కుల హరణ పై పోరాడాలి