సంగారెడ్డిలో ఘనంగా జగన్నాథ రథయాత్ర

సంగారెడ్డి, భారత శక్తి ప్రతినిధి, జూన్ 27: పూరి జగన్నాధుని దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే తనయుడు చింత సాయినాథ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగన్నాథ్ రథయాత్ర ఊరేగింపు కన్నుల పండుగగా కొనసాగింది. సంగారెడ్డి పట్టణంలోని నటరాజ్ థియేటర్ నుంచి ఊరేగింపు ప్రారంభం అయ్యింది. పూరి జగన్నాధుని రథయాత్రను అందంగా అలంకరించి, భక్తి పాటలతో నృత్యాలు చేస్తూ కోలాటం ఆడుతూ ఆనందోత్సవాల నడుమ రథయాత్ర కొనసాగింది. రథయాత్రలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తనయుడు చింత సాయినాథ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నేటి యువతరానికి ఈలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని చింత సాయినాథ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు, నాగరాజ్ గౌడ్ , లాడే మల్లేశం, విష్ణు, చక్రపాణి తదితరులు ఉన్నారు.

సంగారెడ్డిలో ఘనంగా జగన్నాథ రథయాత్ర

సంగారెడ్డి, భారత శక్తి ప్రతినిధి, జూన్ 27:
పూరి జగన్నాధుని దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే తనయుడు చింత సాయినాథ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగన్నాథ్ రథయాత్ర ఊరేగింపు కన్నుల పండుగగా కొనసాగింది. సంగారెడ్డి పట్టణంలోని నటరాజ్ థియేటర్ నుంచి ఊరేగింపు ప్రారంభం అయ్యింది. పూరి జగన్నాధుని రథయాత్రను అందంగా అలంకరించి, భక్తి పాటలతో నృత్యాలు చేస్తూ కోలాటం ఆడుతూ ఆనందోత్సవాల నడుమ రథయాత్ర కొనసాగింది. రథయాత్రలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తనయుడు చింత సాయినాథ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నేటి యువతరానికి ఈలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని చింత సాయినాథ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు, నాగరాజ్ గౌడ్ , లాడే మల్లేశం, విష్ణు, చక్రపాణి తదితరులు ఉన్నారు.

About The Author

Advertisement

Bharatha Sakthi Read Epaper Online

Latest News

ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
వైయస్సార్ కడప జిల్లా, జులై 15(భారత శక్తి) : పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అన్ని...
పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి
పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది
దళితులభూముల కబ్జా, వివక్షత, హక్కుల హరణ పై పోరాడాలి