సేవాస్ఫూర్తితో జన్మదిన వేడుకలు
గుమ్మడిదల, భారత శక్తి ప్రతినిధి, జూన్ 26 : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలోనీ ప్రాథమిక పాఠశాలలో మైత్రి ఫౌండేషన్ చైర్మన్ చెన్నంశెట్టి ఉదయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతోన్న విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేసి, గ్రామ పారిశుధ్య మహిళా కార్మికులకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ చెన్నంశెట్టి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. “మైత్రి ఫౌండేషన్ ద్వారా గతంలో గుమ్మడిదల మండల పరిధిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా అంబులెన్స్ సేవలు, విద్యార్థులకు, ప్రజలకు కార్మికులకు అవసరమైన విధంగా పలు కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు మా ఫౌండేషన్ కట్టుబడి ఉందని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, పాఠశాల సిబ్బంది, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.
గుమ్మడిదల, భారత శక్తి ప్రతినిధి, జూన్ 26 :
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలోనీ ప్రాథమిక పాఠశాలలో మైత్రి ఫౌండేషన్ చైర్మన్ చెన్నంశెట్టి ఉదయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతోన్న విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేసి, గ్రామ పారిశుధ్య మహిళా కార్మికులకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ చెన్నంశెట్టి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. “మైత్రి ఫౌండేషన్ ద్వారా గతంలో గుమ్మడిదల మండల పరిధిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా అంబులెన్స్ సేవలు, విద్యార్థులకు, ప్రజలకు కార్మికులకు అవసరమైన విధంగా పలు కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు మా ఫౌండేషన్ కట్టుబడి ఉందని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, పాఠశాల సిబ్బంది, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.