మాచారెడ్డి లో శ్రీ వీర హనుమాన్ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జూన్ 26: మాచారెడ్డిలో శ్రీ వీర హనుమాన్ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ఏఐసీసీ సెక్రెటరీ విష్ణు నాథన్, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షట్కర్, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాచారెడ్డి మండల కేంద్రంలోని శ్రీ వీర హనుమాన్ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ నూతన చైర్మన్ పాలకవర్గ సభ్యులతో షబ్బీర్ అలీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీ వీరహనుమాన్ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా శెణిశెట్టి రాజమౌళి, డైరెక్టర్లుగా ఎ.రాజేశం,భూక్య శాంతి, సత్యనారాయణ,టి. దేవయ్య గార్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాలు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు మాట్లాడుతూ, వీరహనుమాన్ వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా పురాతన మైనది, మహిమలు గలదని అన్నారు.నాకు ఆలయ అభివృద్ధి చేసే అవకాశం కల్పించిన స్వామివారు,ఆలయ కమిటీ సభ్యులు నిజాయితీగా స్వామి వారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని మీకు ఈ అవకాశం దొరకడం చాలా గొప్ప విషయమని స్వామి వారి కరుణతోనే మీకు ఈ పదవులు వచ్చాయని దాన్ని అభివృద్ధితో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కోరికలు కోరుకున్న వారికి కోరికలు నెరవేరుతాయని, ఆలయ దర్శనం చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. ఆలయ అభివృద్ధికి నా వంతు శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు.
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జూన్ 26: మాచారెడ్డిలో శ్రీ వీర హనుమాన్ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ఏఐసీసీ సెక్రెటరీ
విష్ణు నాథన్, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షట్కర్, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాచారెడ్డి మండల కేంద్రంలోని
శ్రీ వీర హనుమాన్ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ నూతన చైర్మన్ పాలకవర్గ సభ్యులతో షబ్బీర్ అలీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు.
శ్రీ వీరహనుమాన్ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా శెణిశెట్టి రాజమౌళి, డైరెక్టర్లుగా ఎ.రాజేశం,భూక్య శాంతి, సత్యనారాయణ,టి. దేవయ్య గార్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాలు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు మాట్లాడుతూ,
వీరహనుమాన్ వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా పురాతన మైనది, మహిమలు గలదని అన్నారు.నాకు ఆలయ అభివృద్ధి చేసే అవకాశం కల్పించిన స్వామివారు,ఆలయ కమిటీ సభ్యులు నిజాయితీగా స్వామి వారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని మీకు ఈ అవకాశం దొరకడం చాలా గొప్ప విషయమని స్వామి వారి కరుణతోనే మీకు ఈ పదవులు వచ్చాయని దాన్ని అభివృద్ధితో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
కోరికలు కోరుకున్న వారికి కోరికలు నెరవేరుతాయని,
ఆలయ దర్శనం చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అన్నారు.
ఆలయ అభివృద్ధికి నా వంతు శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు.