మహానయీం చర్చి వార్షికోత్సవంలో ఈటల రాజేందర్
- ఘనంగా 45వ వార్షిక వేడుకలు
- హాజరైన మాజీ కార్పొరేటర్ లచ్చిరెడ్డి
బి.ఎన్.రెడ్డి నగర్:
స్థానిక శ్రీ సాయిరాం కాలనీలోని మహానయీం పూర్ణ సువార్త దైవ సమాజం (మహానయీం ఫుల్ గాస్పల్ చర్చి ఆఫ్ గాడ్) 45వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చి నిర్వాహకులు జాన్ బాబు, జాన్ బోయాని ఆహ్వానం మేరకు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్, బి.ఎన్.రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సభ్యులకు శుభాకాంక్షలు
ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. చర్చి సభ్యులందరికీ 45వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు శాంతికి దోహదపడతాయని పేర్కొన్నారు.
About The Author
19 Apr 2026
