చీఫ్ సెక్రటరీ శ్రీ కె. రామకృష్ణారావు ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.
ఉమ్మడి ఆదిలాబాద్ :

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా పంటలు, ప్రజల ఆస్తులకు తీవ్ర నష్టం – ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీ కే. రామకృష్ణా రావు ని కలిసిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు ని మర్యాదపూర్వకంగా కలిసి నిర్మల్ జిల్లాలో వరద నష్టాన్ని వివరించిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలలో విస్తృతంగా పంట నష్టం, ఆస్తి నష్టం జరిగింది. వరద నీరు పలు గ్రామాల్లో ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరదల కారణంగా రైతులు కష్టాల్లో ఉన్నారని, పంటలు పూర్తిగా మునిగిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోయారని, పలు గ్రామాల్లో ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చిందని, ప్రజలకు ప్రభుత్వం నుండి తక్షణ సాయం అందించాలని వివరించారు.
సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం నిర్మల్ జిల్లా రైతులకు అండగా ఉండాలని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. ఆయన వెంట పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి,లోక భూమారెడ్డి, శ్యాం నాయక్, ఆయిర నారాయణరెడ్డిలు తదితరులు ఉన్నారు .
