చీఫ్ సెక్రటరీ శ్రీ కె. రామకృష్ణారావు ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.

ఉమ్మడి ఆదిలాబాద్ :

WhatsApp Image 2025-09-03 at 4.41.15 PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా పంటలు, ప్రజల ఆస్తులకు తీవ్ర నష్టం –  ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీ కే. రామకృష్ణా రావు ని కలిసిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.చీఫ్ సెక్రటరీ  కె. రామకృష్ణారావు ని మర్యాదపూర్వకంగా కలిసి నిర్మల్ జిల్లాలో వరద నష్టాన్ని వివరించిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.

Read More అయ్యప్ప మహా పడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలలో విస్తృతంగా పంట నష్టం, ఆస్తి నష్టం జరిగింది. వరద నీరు పలు గ్రామాల్లో ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Read More కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాలలో విజయం సాధిస్తారు

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. బుధవారం రోజు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు ని మర్యాదపూర్వకంగా కలిశారు.

Read More జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ చేపట్టిన సుందరీకరణ పనులు దాదాపు పూర్తి..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  వరదల కారణంగా రైతులు కష్టాల్లో ఉన్నారని, పంటలు పూర్తిగా మునిగిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోయారని, పలు గ్రామాల్లో ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చిందని, ప్రజలకు ప్రభుత్వం నుండి తక్షణ సాయం అందించాలని వివరించారు.

Read More డీసీ వంశీకృష్ణకు వినతిపత్రం అందించిన రాక్ టౌన్ వెల్ఫేర్ సోసైటీ కార్యవర్గ సభ్యులు

ప్రత్యేకంగా నష్టపోయిన ప్రతి రైతు పంటను సక్రమంగా అంచనా వేయించి, నీట మునిగిన పంటలకు సరైన లెక్కలు వేసి, వారికి తగిన నష్టపరిహారం త్వరగా చెల్లించాల్సిందిగా చీఫ్ సెక్రటరీని విన్నవించారు. అదే విధంగా వరదల్లో  ఆస్తి నష్టం జరిగిన వారికి కూడా తగిన సాయం అందించాలని కోరారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాలలో భారీ మొత్తంలో నష్టం జరిగిందన్నారు. వ్యవసాయ రంగం పెద్ద మొత్తంలో నష్టపోయిందని పేర్కొన్నారు. 

Read More మత్స్యకారులు మత్స్య సంపదపై దృష్టి సాధించాలి : జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం నిర్మల్ జిల్లా రైతులకు అండగా ఉండాలని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  కోరారు. ఆయన వెంట పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి,లోక భూమారెడ్డి, శ్యాం నాయక్, ఆయిర నారాయణరెడ్డిలు తదితరులు ఉన్నారు . 

Read More నేటి భారతం :

About The Author