ఎన్హెచ్ - 44, సదాశివనగర్ లిమిట్స్ లో స్పీడ్ లేజర్ గన్స్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..
కామారెడ్డి :
ప్రజల ప్రాణాలను కాపాడేందుకే వేగ నియంత్రణ ఏర్పాట్లు - నిబంధనలు ఉల్లంఘించిన వారికి స్పీడ్ లేజర్ గన్స్ ద్వారా చాలనాలు జారీ, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న భద్రతా చర్యలు, కట్టుదిట్టమైన నిబంధనల అమలు ఫలితంగా ఈ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గింది.
Read More 10న స్థానిక సంస్థల తుది ఓటరు జాబితా.
ఈ కార్యక్రమంలో భాగంగా, సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్, సదాశివనగర్, ఎన్హెచ్-44 వద్ద అయ్యప్ప ఆలయం సమీపంలో స్పీడ్ లేజర్ గన్స్ ను ప్రారంభించారు. జిల్లాలో మొత్తం మూడు స్పీడ్ లేజర్ గన్స్ వాహనదారుల వేగాన్ని నియంత్రించడం కొరకు పనిచేస్తున్నవి. అధిక వేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించి జరిమానాలు విధించి క్రమంగా వారి వాహణముల వేగనియంత్రణ చేయడం, తద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రధాన ఉద్దేశం. ఇకపై ఈ లేజర్ గన్స్ జాతీయ రహదారి (ఎన్ హెచ్-44), జాతీయ రహదారి (ఎన్ హెచ్-161), రాష్ట్ర రహదారులపై ఉండును.
రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా మీ ప్రాణాన్ని, మీ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకోండి” అని జిల్లా పోలీసు శాఖ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు..
About The Author
12 Sep 2025