కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం జంగంపల్లిలో మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో మంత్రుల ఆకస్మిక తనిఖీ..
తనిఖీలో పాల్గొన్న మంత్రుల పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి
కామారెడ్డి :

కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం జంగంపల్లిలో మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్భంగా వారు విద్యార్థినులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రులు
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, విధిగా మెనూ పాటించాలని అధికారులకు సూచించిన మంత్రులు, పాఠశాలలో బుష్ క్లియర్ చేయాలని తెలిపారు.
విద్యార్థులకు పాఠ్యప్రణాళిక ఎక్కడి వరకు పూర్తయింది అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు లక్ష్యాన్ని నిర్దేశించుకొని విజయం దిశగా సాగాలని సూచించారు. విద్యార్థినులు మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో నైపుణ్యాలు నేర్చుకోవాలని, క్రీడల్లో రాణించాలని సూచించారు.
About The Author
16 Jul 2026
