కాళోజీ ఆశయాలను కొనసాగించాలి
ములుగు జిల్లా :

కాళోజి నారాయణజయంతిని ఘనంగా నిర్వహించి ఆయన ఆశయాలను కొనసాగించాలని అదనపు కలెక్టర్ సంపత్ రావు అన్నారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు కాళోజి నారాయణ చిత్రపటానికి పూలమాల వేసి, ఆయన సేవలను స్మరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజి నారాయణ తెలుగు సాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో చేసిన కృషి విశేషమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు ఆచరణలో పెట్టాలని పేర్కొన్నారు.
About The Author
25 Jun 2026
