కాళోజీ ఆశయాలను కొనసాగించాలి

ములుగు జిల్లా :

WhatsApp Image 2025-09-09 at 6.41.40 PM

కాళోజి నారాయణజయంతిని  ఘనంగా నిర్వహించి ఆయన ఆశయాలను కొనసాగించాలని అదనపు కలెక్టర్ సంపత్ రావు అన్నారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు  కాళోజి నారాయణ చిత్రపటానికి పూలమాల వేసి, ఆయన సేవలను స్మరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజి నారాయణ తెలుగు సాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో చేసిన కృషి విశేషమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు ఆచరణలో పెట్టాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యాలయ ఏవో రాజ్ కుమార్, సూపరింటెండెంట్ మహేష్ బాబు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొ్నారు. ములుగు మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ జనగాం సంపత్ సిబ్బంది తో కలిసి కాళోజీ నారాయణ జయంతిని ఘనంగా నిర్వహించారు

 

About The Author