ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలు

  • *బసవన్న విగ్రహానికి నివాళులర్పించిన రామ్మోహన్ గౌడ్*
  •  *వనస్థలిపురం రైతు బజార్ వద్ద కార్యక్రమం*

ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలు

వనస్థలిపురం:

మహాత్మా బసవేశ్వర 893వ జయంతి వేడుకలను వనస్థలిపురంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. వనస్థలిపురం రైతు బజార్ సమీపంలో వీర శైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

*సమాజ సేవలో బసవన్న బాట..*
అనంతరం రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. సమాజంలోని అసమానతలను తొలగించి, కులరహిత సమాజ స్థాపనకు బసవేశ్వరుడు చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన బోధనలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వనస్థలిపురం బసవేశ్వర సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మానెగారి ప్రభాకర్, ఉపాధ్యక్షుడు దీపావళి శ్రవణ్ కుమార్, కుషాల్ కుమార్, విజయ్ పాటిల్, సంతోష్ కుమార్, బాలు తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-04-20 at 19.43.29 (1)

About The Author