మహిళా సాధికారతే లక్ష్యం: డీసీ శ్రీనివాస్*
సరూర్ నగర్:
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా సంఘాలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే కార్యక్రమం సోమవారం వెంకటేశ్వర కాలనీ కమ్యూనిటీ హాల్లో జరిగింది. సరూర్ నగర్, ఎల్బీనగర్ సర్కిళ్ల పరిధిలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను వివరించారు. ప్రధానంగా...
* *ఆర్థిక భరోసా:* ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం, కొత్త పొదుపు సంఘాల ఏర్పాటు, వడ్డీ లేని రుణాల పంపిణీపై అవగాహన కల్పించారు.
* *సంక్షేమ పథకాలు:* ఆరు గ్యారంటీలు, న్యూట్రిషన్ కిట్లు, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో యూసీడీ సిబ్బంది జి.సహదేవ్, బెల్లి సైదులు, వి.శోభన, డి.కృష్ణవేణి, నర్సింగ్ రావుతో పాటు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
.jpeg)
About The Author
21 Apr 2026
