ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకుని ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి
జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సాంగ్వాన్
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జులై 18:
ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకుని ప్రణాళిక ప్రకారం చదువుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పదవ తరగతి విద్యార్థులతో సంభాషిస్తూ ప్రతిరోజూ పాఠశాలకు రెగ్యులర్ గా హాజరు కావాలని ఐ ఐ ఐ టి సాధించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానోపాధ్యాయులు ఎఫ్ ఆర్ ఎస్,యూనిఫారం, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఎల్ ఐ పీ తప్పనిసరిగా ఆన్లైన్ ఎంట్రీ చేయాలని ఆదేశించారు. ఐ ఎఫ్ పీ ప్యానెల్స్ వినియోగించాలని, విద్యార్థుల పట్ల వ్యక్తిగత శ్రద్ధ పెట్టీ ఉన్నత ఫలితాలు సాధించాలని ఆయన ఆదేశించారు. వన మహోత్సవం లో భాగంగ మొక్కలు నాటారు. నాటి మొక్కలు పరిరక్షించాలని, పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలని ఆయన ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థుల హాజరు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల హాజరు మెరుగు పరిచేలా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భవిత సెంటర్ లో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ రాజు, మున్సిపల్ కమీషనర్ రాజేందర్, విద్యాశాఖ సమన్వయకర్త వేణుగోపాల్, ప్రధానోపాధ్యాయురాలు కరుణ శ్రీ తదితరులు పాల్గొన్నారు.