నేటి భారతం :
ఒక మనిషి మనసు కాలుష్యమైతే అతనికి నష్టం...
ఒక కుటుంబం కాలుష్యమైతే ఆ వీధికి నష్టం..
కానీ ప్రకృతి కాలుష్యం అయితే ఈ ప్రపంచానికే నష్టం..
ఈ కాలుష్యానికి కారణభూతం అయ్యేవారు క్షమారులు కారు..
ప్రకృతి ప్రకోపానికి బలైపోయిన ఎన్నో ప్రాంతాలు..
ఎన్నెన్నో దుర్ఘటనలు ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం..
అయినా మనిషిలో మార్పు మృగ్యమై పోతోంది..
ప్రకృతి నేర్పే పాఠాలను పెడచెవిన పెడుతూనే ఉన్నాం..
ఇది వాంఛనీయం కాదు..
మన కళ్ళముందు కనిపించే ఈ అందమైన లోకం బూడిద కుప్పగా మారకముందే కళ్ళు తెరిచి మేల్కొందాం...
ప్రకృతిని పరిరక్షించుకుందాం..
Read More 10న స్థానిక సంస్థల తుది ఓటరు జాబితా.
About The Author
12 Sep 2025