భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఖమ్మం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.

జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మా ముత్తరావు

ఖమ్మం : 

 

WhatsApp Image 2025-08-29 at 7.06.21 PM

Read More కామారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి..

మా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానీయమంటూ అమరవీరుల స్ఫూర్తితో నిత్యం యువతి, యువకుల, విద్యార్ధుల, ప్రజా సమస్యలపై పోరాడే  డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా 21వ మహాసభలు ఆగస్టు 31న మంచికంటి భవన్ ఖమ్మంలో జరుగుతున్నాయని జయప్రదం చేయాలని జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మ ముత్తరావు పిలుపునిచ్చారు.

Read More స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ నిర్మాణానికి రూ. 6 కోట్లు మంజూరు..

డివైఎఫ్ఐ జిల్లా మహాసభల జయప్రదానికై బోనకల్ మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల విస్తృతంగా ప్రచారం చేస్తూ పోస్టర్లు,కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది.

Read More ప్యాక్స్ కేంద్రాల ద్వారా రైతులకు యూరియా సరఫరాకు చర్యలు

ఈ సందర్భంగా గుమ్మా ముత్తరావు మాట్లాడుతూ..... నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగాల అవకాశాలను కల్పించకపోవడం ఫలితంగా యువత అంత ఫెడధోరణులు పడుతుందని చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు.సమాజంలో రోజురోజుకు గంజాయి, మద్యపానం వాడకం పెరిగిపోయిందని వాటి నిర్మూలనకై యువతను చైతన్యం చేస్తూ డి.వై.ఎఫ్.ఐ నిరంతరం కృషి చేస్తుందని వారు తెలిపారు. జిల్లా మహాసభలలో నేడు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున యువజన, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేసి భవిష్యత్ కార్యాచరణ పోరాటాలకు సిద్ధం అయ్యేందుకు జారుతున్నాయని, ఈ మహాసభలను యువతి, యువకులు, విద్యార్దులు, ప్రజలు హాజరై జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రోహిత్, నరేష్, బంక శ్రీను, అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

Read More పాత పెన్షన్ ను పునరుద్దరించాలి

About The Author