వన మహోత్సవాన్ని వేగవంతంగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

వన మహోత్సవాన్ని వేగవంతంగా పూర్తి చేయాలి

భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, జూలై 23: పచ్చదనం పెంపే లక్ష్యంగా జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమాన్ని వేగవంతంగా కొనసాగించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.

 బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వన మహోత్సవం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Read More కాకతీయ గడ్డ నుండే బీసీల రిజర్వేషన్ల ఉద్యమం

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వనమహోత్సవం లో భాగంగా ఆయా శాఖల ఆధ్వర్యంలో విరివిగా మొక్కలు నాటాలని ఆదేశించారు. జిల్లాలో ఈ సంవత్సరం 69 లక్షలు 55వేల మొక్కలు నాటేలా ప్రణాళికలను రూపొందించడం జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు ఆయా శాఖల ఆధ్వర్యంలో 44 శాతం మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు. శాఖల వారిగా నాటిన మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, రాబోయే 15 రోజులలోపు మొక్కలు నాటే ప్రక్రియను పూర్తిచేయాలని, ప్రతి మొక్కను జియోట్యాగ్ చేయాలని స్పష్టం చేశారు.

Read More ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష సమావేశం..

హార్టికల్చర్ మొక్కల నాటుదలకు వ్యవసాయ శాఖ సహకారం తీసుకోవాలని ఎంపీడీఓలకు సూచించారు. మొక్కలు నాటిన వెంటనే సంబంధిత వివరాలు అటవీ శాఖ అధికారులకు పంపించాలని అన్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై సమీక్షించిన కలెక్టర్, వెంటనే నిర్మాణాలను పూర్తి చేయాలని, మార్కౌట్ పూర్తి చేసిన ఇండ్లకు గ్రౌండింగ్ పనులు తక్షణమే ప్రారంభించాలన్నారు. మేస్త్రీల కొరత ఉండకుండా తగిన సన్నాహాలు చేసుకోవాలని సూచించారు.

Read More స్వచ్ఛత హరిత పాఠశాలకు యూనిసెఫ్ సహకారం అవసరం

ఇసుక కొరత రాకుండా తహసీల్దార్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి లబ్ధిదారుల సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, డిఎఫ్‌ఓ నాగిని భాను, ఆర్డీవోలు రత్నకల్యాణి, కోమల్ రెడ్డి, డీఈఓ పీ. రామారావు, జెడ్పి సీఈవో గోవింద్, డిపిఓ శ్రీనివాస్, ఏడి సర్వే & ల్యాండ్ రికార్డ్ ఆర్. సుదర్శన్ సహా పలువురు జిల్లా, మండల స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

Read More ప్రభుత్వ నిబంధన ప్రకారమే ఇసుక రవాణా 

About The Author