జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం 

మంత్రి సీతక్క 

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం 

ములుగు జిల్లా ప్రతినిధి, జూలై 18 (భారత శక్తి) :
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (టి ఎస్ జె యు) ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం గౌడ్ నారగౌని, ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, ఎన్ యు జె (ఐ) జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్ లు ములుగు జిల్లా యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు చల్ల గురుగుల రాజు వర్ధన్, సంఘ రంజిత్ కుమార్ లతో కలిసి శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కకు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రంలో వరంగల్ ఉమ్మడి జిల్లా సమావేశం నిర్వహించి, టీఎస్ జె యు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ములుగు మండలానికి చెందిన మాట్ల సంపత్, కార్యవర్గ సభ్యుని గా గండ్రత్ విజయాకర్, అదేవిధంగా టి ఎస్ జె యు మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వరంగల్ కు చెందిన తాటికొండ రజిని, ఉపాధ్యక్షురాలుగా జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన పోచంపల్లి రజిత లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలు పావుశెట్టి శ్రీనివాస్, నాగపురి నాగరాజ్, ములుగు జిల్లా యూనియన్ ఉపాధ్యక్షుడు నాగపురి హరినాథ్ గౌడ్, సభ్యులు చల్లూరి మహేందర్, పెండం బిక్షపతి, ధనుంజయ్ రాము, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కందికొండ మోహన్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రాము, ప్రధాన కార్యదర్శి హరికృష్ణ, జాయింట్ సెక్రెటరీ దాడి బిక్షపతి, జనగాం జిల్లా అధ్యక్షుడు యు. నరేందర్, మహబూబ్ బాద్ జిల్లా అధ్యక్షుడు ఉదయ్ ధీర్, కార్యదర్శి సతీష్ చారి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్, కార్యదర్శి దొమ్మాటి రవి, ఉపాధ్యక్షుడు బండారి రాజు తదితరులు పాల్గొన్నారు.

Read More భైంసాలో ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ డా: జి.జానకి షర్మిల..

About The Author