
కాణిపాకంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ దేవరాయ నిత్యాన్నదాన ట్రస్టు, ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఏ.ఎస్ మనోహర్, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుకి శ్రీ కృష్ణ దేవరాయ నిత్యాన్నదాన ట్రస్టు సభ్యులు సాదర స్వాగతం పలికారు. దానంలోకెల్లా అన్నదానం మిన్న.. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో శ్రీ కృష్ణ దేవరాయ నిత్యాన్నదాన ట్రస్టును ఏర్పాటు చేసి.., ఆకలిని తీర్చే శ్రీ కృష్ణ దేవరాయ నిత్యాన్నదాన ట్రస్టు సభ్యులకు అభినందనలు తెలియజేశారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.. ఇలాంటి అన్నదాన ట్రస్టులు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.