బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా :
- టిఆర్పీ జిల్లా నాయకుడు రవి పటేల్..
- భూపాలపల్లిలో ధర్నా, రాస్తారోకో..
- లీడర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందేనని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఆర్పీ)జిల్లా నాయకుడు రవి పటేల్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్త బంద్ లో భాగంగా పార్టీ జిల్లా నాయకులు రవి పటేల్ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా, రాస్తారోకో చేశారు. అంతకుముందు నాయకులు, కార్యకర్తలు కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రధాన రహదారిపై ధర్నా చేస్తున్న విషయాన్ని గమనించిన ఎస్సై సాంబమూర్తి ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తమ సిబ్బందితో వెళ్లి ధర్నా చేస్తున్న నాయకులను బలవంతంగా లాక్కెళ్లి, అదుపులోకి తీసుకుని వదిలేశారు.
ఈ కార్యక్రమంలో టిఆర్పీ జిల్లా నాయకులు కరుణాకర్, చంద్రశేఖర్, సంతోష్, శ్రీను, వెంకన్న, సమ్మయ్య, నవీన్, అక్షయ్, సన్నీ, శంకర్రావు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
Read More యథా విధిగా ప్రజావాణి కార్యక్రమం..
About The Author
18 Oct 2025