అధిష్టానం నిర్ణయమే ఫైనల్..
సంగారెడ్డి :
* జిల్లా అధ్యక్షుడు గా ఎవరిని నియమించిన కలిసి పనిచేస్తాం..
* పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం..
* నీలం మధు ముదిరాజ్..
* బూత్, బ్లాక్ స్థాయిలో అభిప్రాయ సేకరణ..
* సంగారెడ్డిలో ఏఐసీసి అబ్జర్వర్ మీడియా సమావేశం, అభిప్రాయ సేకరణ..
డీసీసీ అధ్యక్షుడిగా అధిష్టానం ఎవరిని నియమించిన వారితో కలిసి పనిచేస్తామని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోనీ రెడ్లస్ ఇన్ బాంక్వెట్ హాల్ లో ఆదివారం డిసిసి అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి ఏఐసీసీ సెక్రటరీ, సంగారెడ్డి అబ్జర్వర్ సజరిట లైత్ ప్లాంగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశం మరియు అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేష్ షెట్కర్, పీసీసీ అబ్జర్వర్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు,మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సంగారెడ్డి డిసిసి అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, వివిధ కార్పోరేషన్ల చైర్మన్ లతో కలసి నీలం మధు పాల్గొన్నారు.