పెట్రోల్ బంక్స్ లో సౌకర్యాలేవీ.. సార్.?

మణుగూరు :

-కొరవడిన నాణ్యతా ప్రమాణాలు
-తాగునీరు, మౌళిక సదుపాయాలు కరవు
-అగ్నిమాపక నివారణ యంత్రాలు లేవు
-అధికారుల వివరాలు, హెచ్చరికల బోర్డులు నిల్
-బంకుల్లో ఇసుక లేని బకెట్లు దర్శనం
-పనిచేయని గాలి యంత్రాలు

WhatsApp Image 2025-10-10 at 5.11.14 PM

పెట్రోల్ బంకుల్లో నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఇక యజమానుల నిర్లక్ష్యానికి సౌకర్యాలు కల్పించటంలేదు. అధికారుల వివరాలు, కనీసం హెచ్చరికల బోర్డులులేనేలేవు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బంకుల్లో ఇసుక బక్కెట్ల సాయంతో మంటలను అదుపు చేస్తారు. కనీసం ఇసుక లేకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని చెప్పవచ్చు. రెవెన్యూ, పౌరసరఫరా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. నాణ్యతా నిర్ధారణకు డెన్సిటీ పరీక్షలకు అవసరమైన ఫిల్టర్ పేపర్ అందుబాటులో ఉంచటం లేదు. పెట్రోలు బంకుల్లో నియమ నిబంధనలు కొరవడ్డాయి. బంకుల్లో కనీస సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలు కొరవడి వినియోగదారులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంకుల యజమానులు వినియోగదారులకు సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. బంకులను పర్యవేక్షించాల్సిన రెవెన్యూ, పౌరసరఫరా అధికారులు బంకులవైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు ఉదాహరణగా మణుగూరులోని హెచ్ పి బంక్, ఇండియన్ ఆయిల్ బంక్ లను చెప్పుకోవచ్చు.

Read More నేటి భారతం :

 కొరవడిన నాణ్యతా ప్రమాణాలు: 

Read More జర్నలిస్టు వెంకటకృష్ణ మృతికి టి జె ఎఫ్ ఘన నివాళి

మణుగూరు పట్టణ పరిధిలో ఉన్న బంక్ ల్లో పెట్రోల్, డీజల్ నాణ్యతపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసే ఉపకరణాలు అందుబాటులో ఉండడంలేదు. నాణ్యత నిర్ధారణలో భాగంగా నిర్వహించాల్సిన డెన్సిటీ పరీక్షలకు అవసరమైన ఫిల్టర్ పేపర్ అందుబాటులో ఉంచడంలేదు. నాణ్యతపై అనుమానాలు ఉంటే స్థానిక రెవెన్యూ, పౌరసరఫరాశాఖ అధికారులకు పిర్యాదు చేయాలి. ఇందుకోసమై అధికారుల వివరాలు, ఫోన్ నెంబర్ల బోర్డులు వినియోగదారులకు కనిపించే విధంగా అందుబాటులో ఉంచాలి. అగ్నిమాపక నివారణ పరికరాలు అలంకారప్రాయంగానే ఉంటున్నాయి. పెట్రోలు పోయించుకునేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడ కూడదనే నిబంధనలు పాటించక పోవడంతో తరచూ కొన్ని చోట్ల అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయన్న వార్తలు వినబడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ అక్కడ సూచిక బోర్డులులేవు. ఇసుక బకెట్లు ఏర్పాటు చేయడంలేదు. ఉన్న బకెట్లు పూర్తిగా ధ్వంసం అయిఉన్నాయి. ఆయిల్ కార్పొరేషన్ నిబంధనల మేరకు ప్రతి పెట్రోల్ బంకులో వాహనాలకు ఉచితంగా గాలినింపే యంత్రాలు ఉంచాలి. కోరిన ప్రతి వినియోగదారునికి ఉచితంగా గాలి నింపాలి. ఇక్కడ గాలినింపే యంత్రం ఎప్పుడూ పనిచేయదు. అలంకార ప్రాయంగా దిష్టిబొమ్మ లాగా కన్పిస్తుంటాయి. ఉచితంగా శుద్ధమైన త్రాగునీరు వాహనదారులకు అందుబాటులో ఉంచాలి. అలాగే మరుగుదొడ్లు, సేద దీరడానికి అనువైన గదులు ఏర్పాటు చేయాలి. మహిళలకు సురక్షితమైన ప్రదేశంలో విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలి. రాత్రి వేళల్లో దూరప్రయాణాలు చేసిన వాహనాలు కోరితే వాటికి పార్కింగ్ ఏర్పాటు చేయాలి. రాత్రివేళల్లో బంకులకు చుట్టూ విద్యుత్లైట్లను ఏర్పాటు చేయాలి. పెట్రోల్ బంకుల నిర్వహణపై వినియోగదారులకు అవగాహన లేకపోవడంతో బంకు నిర్వాహకులకు ఇష్టారాజ్యంగా మారింది.

Read More తెలంగాణ రాజ్యాధికార పార్టీ TRP ఆధ్వర్యంలో స్టార్ చిల్డ్రన్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం

 కేటాయింపులపై నిర్లక్షం: 

Read More కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష రేసులో పిప్పాల రాజేందర్

పోలీసు, అంబులెన్స్, జ్యూడిషియరీ, అగ్నిమాపక వంటి అత్యవసర సేవలందించే ప్రభుత్వ వాహనాలకు నిత్యం పెట్రోల్, డీజల్ను అందుబాటులో ఉంచాలి. కొన్ని చోట్ల స్టాకు లేదంటూ బోర్డులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వీరికి కేటాయించిన ఆయిల్ ను సైతం ఇతర వాహనాల్లో బయటకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. 

Read More శబరిమలలో చోరీపై కేంద్రం జోక్యం చేసుకోవాలి

 డిజిటల్ లావాదేవీల నిర్వహణ 

Read More పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి  

నగదు కొరతను అధిగమించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి పెట్రోల్ బంకుల్లో స్వైప్ యంత్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేశారు. కొన్ని చోట్ల ఈ యంత్రాలు మూలనపడడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. స్థానిక రెవెన్యూ అధికారులు నెలకోసారి బంకులను తనిఖీ చేయాల్సి ఉండగా బంకుల వైపు వెళ్లడమే మానేశారు. మణుగూరు తహశీల్దార్ అద్దంకి నరేష్ ను వివరణ కోరేందుకు చరవాణి ద్వారా ప్రయత్నించగా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 

Read More జిల్లా రిజిస్ట్రార్‌ గా శగుఫ్తా ఫిర్దోస్

About The Author