నేటి భారతం.. :
.jpg)
ప్రజల డబ్బుతో పట్టణాలు నిర్మించాలంటే..
ముందుగా మనసు స్వచ్ఛంగా ఉండాలి..
మున్సిపల్ కమిషనర్ గది పారదర్శకంగా ఉంటే
పట్టణం కూడా శుభ్రంగా ఉంటుంది..
అవినీతి చేసే అధికారి కూల్చేది భవనాలు కాదు, ప్రజల విశ్వాసం..
పట్టణం చెత్తతో నిండిపోతే ప్రజలను తప్పు అంటారు..
కానీ నిజానికి అవినీతి అధికారి చేతుల్లోనే చెత్త మొదలవుతుంది.
ఒక అవినీతి కమిషనర్ నగరాన్ని కాదు, నైతికతను కూలదోయగలడు..
నగర అభివృద్ధి ఫైల్స్లో కాదు, మనసులో ఉండే నిజాయితీలో మొదలవుతుంది.
పట్టణం శుభ్రం కావాలంటే ముందు మున్సిపల్ కార్యాలయం శుభ్రం కావాలి.
కమిషనర్ పదవి సేవకే కానీ, స్వార్థానికి కాదు అన్నది తెలుసుకోవాలి..
ప్రజా సేవ అనే పథకాన్ని అవినీతి ప్రాజెక్టుగా
మార్చే వాళ్లు ప్రజల శాపం నుంచి తప్పించుకోలేరు.
ఒక నిజాయితీ కమిషనర్ నగరానికి కాంతి, ఒక అవినీతి కమిషనర్ చీకటితో సమానం..
Read More పోలంపల్లి లో సైకిల్ల పంపిణి
Read More నేటి భారతం
About The Author
15 Nov 2025
