ఘనంగా శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలు

భూపాలపల్లి జిల్లా :

WhatsApp Image 2025-10-13 at 6.48.49 PM

తెలంగాణ తొలి శాసన సభాపతి, శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు, సిరికొండ అభిమానులు బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు అనంతరం కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచినారు అనంతరం మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.

Read More పాండవుల గుహలను సందర్శించిన వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్స్

ఈ సందర్భంగా మున్సిప ల్ మాజీ చైర్మన్ బండారి సంపూర్ణ రవి, శశి కాంత్ మాట్లాడుతూ... సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భూపాలపల్లి జిల్లా ఏర్పాటు కావడానికి సిరికొండ మధుసూదనా చారి అనేక కృషి చేశారు నియోజకవర్గాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేసిన సిరికొండ పేరు స్థిర స్థాయిగా ఉంటుంది ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద భూపాలపల్లి జిల్లాను ఆనాడు కెసిఆర్ నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది.. 

Read More నేటి భారతం :

నియోజకవర్గం రోడ్లు అనేక అభివృద్ధి పనులను చేసిన నాయకుడు సిరికొండ చెంచు కాలనీ వాసులకు ఇండ్లు కట్టించినారు వారిని అసెంబ్లీకి ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసి తీసుకపోవడం జరిగింది అలాంటి నాయకుడిని ఎవరు మర్చిపోలేరు కావున వారి చేసిన అభివృద్ధి పనిని గుర్తు చేసుకుంటూ ఈరోజు వారి జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అని వారు అన్నారు.

Read More యథా విధిగా ప్రజావాణి కార్యక్రమం..

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బండారి సంపూర్ణ రవి, శశి కాంత్, ఖలీద్, అగుర్ల శ్రీనివాస్, సూర రాజేష్, సదానందం, మాకోటి ఓదెలు,కిరణ్, తాళ్ళ శ్రీనివాస్, సుధాకర్, అనిల్, రంజిత్, పూర్ణ యాదవ్, మహిళ నాయకురాలు మేకల రజిత, ఓరుగంటి లక్ష్మీ,జెరుపుల గంగ, మియాపురం స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Read More ప్రతి పాత్రికేయునికి ఇళ్లు,ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

About The Author