బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో :

దీపావళి సందర్భంగా భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి :: నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి. జానకి షర్మిల.

WhatsApp Image 2025-10-12 at 5.03.39 PM

ప్రజల భద్రత, క్షేమం దృష్టిలో ఉంచుకొని రాబోయే దీపావళి పండుగను ప్రజలందరూ ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, సూచించారు. బాణాసంచా విక్రయాల కోసం అనుమతి తప్పనిసరి. ఎలాంటి అనుమతులు లేకుండా బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేసినా, సరైన భద్రతా ప్రమాణాలు లేకుండా విక్రయాలు జరిపినా, ప్రేలుడు పదార్థాల చట్టం (Explosives Act) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read More పాండవుల గుహలను సందర్శించిన వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్స్

దీపావళి నేపథ్యంలో బాణాసంచా తయారీదారులు, సరఫరాదారులు, విక్రయదారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరిపే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Read More తెలంగాణ రైజింగ్ విజన్ -2047 సర్వేలో ప్రజలు, ఉద్యోగులు పాల్గొనాలి

పాటించ వలసిన భద్రతా చర్యలు :

Read More నేటి భారతం :

దుకాణాల మధ్య కనీస దూరం పాటించాలి... అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచాలి... విద్యుత్ లైన్ల దగ్గర బాణాసంచా నిల్వ చేయరాదు... మైనర్లు (చిన్నపిల్లలు) విక్రయంలో పాల్గొనరాదు. ప్రజలందరూ చట్టాలు, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ డా. జి. జానకి షర్మిల  కోరారు.. 

Read More నేటి ప్రజావాణి రద్దు

About The Author