కరీంనగర్ లో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్ పైనే

అట్టహాసంగా కవాతును ప్రారంభించిన కేంద్ర మంత్రి సంజయ్

కరీంనగర్ : 

WhatsApp Image 2025-10-12 at 6.08.55 PM

కరీంనగర్ లో అందరి చూపు రాష్ట్రీయ స్వయం సేవక్ రూట్ మార్చ్ పైనే ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం నగరంలో ఆర్ ఎస్ ఎస్ శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కవాతును అట్టహాసంగా (పత్ సంచలన్)ప్రారంభించారు. రాంనగర్ సత్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి ప్రారంభం అయిన ఆర్ ఎస్ ఎస్ రూట్ మార్చ్ లో పాల్గొని కేంద్ర మంత్రి మాట్లాడుతూ కరీంనగర్  ఆర్ఎస్ఎస్ లో కార్యకర్తగా జీవితం ప్రారంభం అయిందని చెప్పారు.

Read More రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలి..

చదువుకునే సమయంలో కరీంనగర్ రాంనగర్ బస్తీలో ముఖ్య శిక్షక్ గా కొనసాగించాననీ తెలిపారు.బండి సంజయ్ తోపాటు రాష్ట్రీయ స్వయం సేవక్  రూట్ మార్చ్ లో పాల్గొన్న కేంద్ర మంత్రి కుమారుడు సాయి సుముఖ్ పాల్గొనగా ఆర్ ఎస్ ఎస్ వస్త్రాదారణలో ఆకట్టుకున్నారు. 

Read More అభివృద్ధి పనులకు 2కోట్ల హెచ్ఎండిఏ నిధులు మంజూరు

About The Author