అంబేద్కర్ సచివాలయంలో జాతర ఏర్పాట్లపై సమీక్షా

ములుగు జిల్లా ప్రతినిధి :
మేడారం జాతర ఏర్పాట్లను మొత్తం 8 జోన్లు, 31 సెక్టార్లుగా విభజించినట్లు తెలిపారు. జోన్–3 జంపన్న వాగు ప్రాంతంగా నిర్ణయించి,జాతర సమయంలో 10 నుండి 12 వేలమంది పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. ప్రతి జోన్కు ఒక జోనల్ అధికారిని నియమించ నున్నట్లు తెలిపారు.
కోర్ రూట్లు పార్కింగ్ ప్రదేశాలను గుర్తించారు. మొత్తం 49 పార్కింగ్ ప్రదేశాలు (వెయ్యి 50 ఎకరాలు) గుర్తించబడి, దాదాపు 4.5 నుండి 6 లక్షల వాహనాలు నిలిపే సదుపాయం కల్పించబడుతుందని, ఈ ఏర్పాట్లు నవంబర్ 30 నాటికి పూర్తవుతాయని తెలిపారు.
అటవీ శాఖ ఆధ్వర్యంలో 24+9 ఫారెస్ట్ రోడ్లు (కచ్చా నుండి డబుల్ లేన్) రూపంలో అభివృద్ధి చేస్తున్నారు. వీటిలో భాగంగా వైల్డ్
లైఫ్ శాంక్చువరీలోని రహదారులు కూడా చేర్చబడ్డాయి.
ఆర్ & బీ శాఖ ద్వారా 42 కోట్లతో ఆలయం చుట్టూ రహదారులు, 92 కోట్లతో ప్రధాన రహదారులు నిర్మించబడుతున్నాయి. జాతర సమయానికి ముందు, మధ్య మరియు తరువాత ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేక జాతర సందర్శనలు చేపట్టనున్నట్లు తెలిపారు.
జంపన్న వాగు వద్ద తాత్కాలిక రహదారి కూలిపోయిన కారణంగా మరమ్మత్తు పనులు వేగంగా జరుగుతున్నాయి. 517 బోరుపాయింట్లు/నీటి వనరులు, 250 కిలోమీటర్ల రహదారులపై లైటింగ్ పనులు జరుగుతున్నాయి.
స్థానికుల సహకారంతో 6 స్లాటర్ సెంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి. జంపన్న వాగు పునరుద్ధరణ పనులు సాగిస్తున్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు.
9,111 విద్యుత్ స్తంభాలు, 259 ట్రాన్స్ఫార్మర్లు అమర్చే పనులు విద్యుత్ శాఖ చేపట్టింది. జాతర ప్రాంతమంతా ఎండోమెంట్స్ శాఖ ఆధ్వర్యంలో ప్రకాశ ఏర్పాట్లు (ఇల్యూమినేషన్) చేయనున్నారు.
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర విజయవంతంగా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని సబ్యసాచి ఘోష్ ఆదేశించారు.
ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేష్ భగత్, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, ములుగు ఎస్పీ, ఐ టి డి ఏ పి ఓ చిత్ర మిశ్రా, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, ఎలక్ట్రిసిటీ CMD వరుణ్ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక, ఇతర సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొని తమ తమ ఇన్పుట్ అందించారు.
