కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే కాళేశ్వరంపై కుట్రలు

సోషల్ మీడియా కన్వీనర్, రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి

ములుగు జిల్లా : 

WhatsApp Image 2025-09-01 at 6.03.56 PM

తెలంగాణకు వరప్రధాయని లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరుగుతున్న తతంగం అంతా మోడీ, రేవంత్ రెడ్డి కలిసి చేస్తున్న కుట్ర లని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. సంక్షేమ ఫలాలతో దేశానికే తెలంగాణను రోల్ మోడల్ గా నిలిపిన బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని రేవంత్ రెడ్డి ద్వారా మోడీ కుట్ర చేస్తున్నారని అన్నారు. కమిషన్ రిపోర్ట్ చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతోందని తెలిపారు. 

Read More గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ అది

కాళేశ్వరంపై అంతా కమిషన్ చూసుకుంటుందని మొదట రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. కానీ చర్యలకు సంబంధించి ప్రభుత్వానిదే నిర్ణయం అని ఘోష్ చెప్పారని వివరించారు. రేవంత్ రెడ్డి దీనిని తీసుకెళ్లి మోడీ పెంపుడు చిలుక అయిన సిబిఐ చేతిలో పెడుతున్నారని విమర్శించారు. మోడీ చెప్పినట్టు సీబీఐ ఆడుతుందన్నరు. 

Read More సెల్యూట్.. నిర్మల్ పోలీస్.

దీనికితోడు.. అర్థరాత్రి అసెంబ్లీలో చర్చించి.. రెండు గంటలకు సభ ముగించి.. అప్పుడే అసెంబ్లీ ప్రతులు తయారు చేశారని.. ఉదయం 10 గంటల లోపే సీబీఐకి అప్పగించారన్నారు. ఇంత ఆగమేఘాల మీద సభ పెట్టి.. అర్థరాత్రి సమయంలో చర్చించి.. తెల్లవారగానే సీబీఐకి అప్పగించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఏ కుట్రా లేకపోతే.. సర్కారుకు, రేవంత్ రెడ్డికి ఎలాంటి దురుద్దేశం లేకపోతే అంత ఆగమాగం చేయాల్సిన అవసరం ఏంటన్నారు. 

Read More స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలి..

గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఇచ్చిన ఎన్డీఎస్ఏ మోడీ చేతిలో తోలుబొమ్మ అని.. ఇప్పుడు సీబీఐ కూడా తోలుబొమ్మేనని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రినని చెప్పుకుంటూ.. పూర్తిగా మోడీ చేత.. మోడీ కొరకు.. మోడీ వలన పనిచేస్తున్నారని సతీష్ రెడ్డి ఆరోపించారు. 

Read More ప్రజావాణికి 44 దరఖాస్తులు

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు కేసీఆర్ చేసిన మంచి ఏంటో ప్రజలందరికి తెలునన్నారు. అలాగే.. రేవంత్ రెడ్డి, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమని ప్రజలకు తెలిసిపోయిందని  పేర్కొన్నారు.

Read More కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలి

About The Author