కామారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి..
రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, తెలంగాణా వైద్య విధాన పరిషత్ కమిషనర్ లు
కామారెడ్డి :

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన అత్యవసర పరిస్థితులు, ఆరోగ్య శాఖ సంసిద్ధత ఏర్పాట్లను సమీక్షించడానికి గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డా. రవీందర్ నాయక్, తెలంగాణా వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా. అజయ్ కుమార్ కామారెడ్డి లో పర్యటించారు. ఇట్టి పర్యటనలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గల అత్యవసర వైద్య సేవల సదుపాయాల గురించి ఆరా తీశారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి, ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు.
హౌసింగ్ బోర్డు కాలనీ , సత్య గార్డెన్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఆరోగ్య శాఖ తరపున ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దేవునిపల్లిని సందర్శించి పరిశీలించి మందుల కొరత ఇతర మౌలిక అవసరాల కొరత లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి అని ఆదేశించారు.
Read More రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2047 జూమ్ సమావేశం
About The Author
06 Dec 2025
