నేటి భారతం :

మీ కన్నీటి నుంచే కసి పుట్టాలి..
ఎదురైనా అవమానాలు ఎన్ని ఉన్నాసరే..
ఆ అవమానాలనుంచి ఎదగాలనే లక్ష్యం ఏర్పడాలి..
నిన్ను ఎవరైతే ఎగతాళి చేశారో..
వారే మనకోసం ఎదురుచూడాలి..
నువ్వు ఉన్నతంగా ఆలోచించు..
కష్టమో, నిష్టూరమో ఉన్నత శిఖరాలు అధిరోహించు..
అప్పుడు నిన్ను తలదించుకునేలా చేసిన వారు..
తలెత్తి నిన్ను చూసేలా నిలబడు..
అవమానాలు, అపజయాలు అన్నది పెద్ద సమస్యలే కాదు..
అనారోగ్యం సమస్య, చెడ్డపేరు సమస్య, ఆకలి అనేది మరో సమస్య..
ఈ సమస్యల ముందు అవమానాలు ఒక లెక్కకాదు..
దైవం మీద భారం వేయి.. ఒక లక్షణాన్ని నిర్దేశించుకో..
నీతిగా, నిజాయితీగా ప్రయత్నం చెయ్..
అంతే.. అదే నీ విధి.. ఫలితం దానంతట అదే వస్తుంది.
Read More రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలి..
About The Author
15 Nov 2025
