క్విజ్ పోటీల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రథమ బహుమతి
సంగారెడ్డి :
సంగారెడ్డి ప్రభుత్వ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో బైపీసీ చదువుతున్న కృష్ణ, సయ్యద్ అన్వర్ స్టేట్ రాష్ట్ర లెవెల్ క్విజ్ పోటీల లో ప్రథమ బహుమతి సాధించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆల్ రితం కన్వెన్షన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శోభారాణి, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు. తదుపరి పోటీలు బీహార్ లో ఉన్నందున విద్యార్థులు వెళ్లేందుకు ఫ్లైట్ ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రిన్సిపాల్ తెలిపారు.
About The Author
12 Sep 2025