నేటి స్వాతంత్య్ర సంబురం, వెలకట్టలేని వీరుల పోరాటాల ఫలితం...
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
- స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు పునరంకితం కావాలి.
- ప్రజల సంక్షేమం, అభివృద్దే ధ్యేయం ప్రతి ఒక్క అధికారి పనిచేయాలి.
- కలెక్టర్ క్యాంపు, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన జిల్లా కలెక్టర్
ఖమ్మం ప్రతినిది : వెలకట్టలేని వీరుల పోరాటాల ఫలితం ఎంతో మంది త్యాగాలతో స్వాతంత్య్రo సాధించుకున్నామని, ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఖమ్మం జుబ్లీపురాలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో, జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందు కలెక్టర్, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు.
Read More ఆరోగ్య తెలంగాణ సాధించడమే లక్ష్యం..
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో దీక్షా రైనా, డిప్యూటీ జడ్పీ సీఈవో నాగ పద్మజ, పీఆర్ ఎస్ఇ వెంకటరెడ్డి, పీఆర్ డిఇ మహేష్ బాబు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read More శ్రావణమాసం బోనమెత్తిన శివసత్తులు