పారదర్శకంగా డిసిసి అధ్యక్షులు నియామకం

భూపాలపల్లి జిల్లా :

- నూతన కమిటీలతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం
- కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా కలిసికట్టుగా కృషి చేద్దాం
- డిసిసి అధ్యక్షుల అబ్జర్వర్ అబ్రహం జాన్సన్

WhatsApp Image 2025-10-13 at 7.00.00 PM

డిసిసి అధ్యక్షుల నియామకాన్ని పారదర్శకంగా నియమించేందుకు గాను కాంగ్రెస్ పార్టీ అందరి అభిప్రాయాలతో ముందుకు వెళ్తుందని ఏఐసీసీ నేత, డిసిసి అధ్యక్షుల అబ్జర్వర్ అబ్రహం జాన్సన్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసీసీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన సోమవారం డిసిసి అధ్యక్షుల ధరఖాస్తుల స్వీకరణ, నియామక అభిప్రాయాలపై నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అబ్రహం జాన్సన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా డీసీసీ అధ్యక్షుల నియామకంపై దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. ఇందులో పార్టీ కోసం పని చేసే ముఖ్య నేతలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలియజేశారు. క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ చేపట్టి, అందరి అభిప్రాయాలు సేకరించి పారదర్శకంగా అధ్యక్షుల నియామకం చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా అబ్జర్వర్లుగా తాము హాజరు కావడం జరిగిందన్నారు. డిసిసి అధ్యక్షుల నియామకాలతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కానుందని దాని ద్వారా అందరూ కలిసికట్టుగా పనిచేసి రానున్న ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. 

Read More సామినేని హంతకుల అరెస్టు చేయాలి..

అనంతరం స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ అంచలంచెలుగా ముందుకు పోవడం జరుగుతుందన్నారు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పిలుపుమేరకు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి, రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ కోసం పార్టీ సిద్ధాంతాలతో ముందుకు వెళ్లాలని చెప్పారు. పదవులు వచ్చినా, రాకున్నా అధైర్య పడకుండా ముందుకు సాగాలని ధైర్యం చెప్పారు. కష్టపడిన నాయకులు కార్యకర్తలను గుర్తించి పార్టీ తగిన నిర్ణయం తీసుకుంటుందని, వారికి తగిన పదవులు ఇస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. 

Read More విదేశాల్లో బందీ అవుతున్న భారతీయ మేధస్సు..

ఈ సమావేశంలో అబ్జర్వర్లు సాగరికరావు, నాగేందర్ రెడ్డి, సుబ్బారావు,  సంజీవ్, నాయకులు కోట రాజబాబు, గూటోజు కిష్టయ్య, గుమ్మడి శ్రీదేవి, గాజర్ల అశోక్, చల్లూరి మధు, బట్టు కర్ణాకర్, సుంకరి రామచంద్రయ్య, గాదె సమ్మిరెడ్డి, భువన సుందర్, వివిధ మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Read More ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించండి

About The Author