ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్,అంగన్వాడి కేంద్రాల్లో మెను అమలుపర్చాలి
ప్రాధమిక స్థాయి లోనే విద్యార్థులకి తెలుగు, ఇంగ్లీష్ బాషలపై పట్టు సాధించాలి.... జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట జిల్లా బ్యూరో (భారతశక్తి) జూలై 23: ప్రభుత్వ హాస్పిటల్ లో సాధారణ ప్రసవాలు పెంచేలా వైద్య అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణం లోని అంబేద్కర్ నగర్ అర్బన్ పి హెచ్ సి, ట్రైబల్ వెల్ఫేర్ బాలుర వసతి గృహం, అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకక్ష్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏ ఎన్ సి రిజిస్టర్, ఎనిమియా కేసుల వివరాలు అడిగి తెలుసు కున్నారు. ప్రసూతి ల వివరాలు వారికి అందుతున్న సేవలు గురించి ఆరా తీశారు. ఫార్మసీ స్టోర్ నందు ఉన్న డ్రగ్స్ వివరాలు అడిగి తెలుసు కున్నారు.1700 మంది హైపర్ టెన్షన్ కేసులు తమ పరిధిలో ఉన్నారు అని సిబ్బంది కలెక్టర్ కి వివరించారు. తదుపరి కలెక్టర్ ట్రైబల్ బాలుర వసతి గృహంలో ఉన్న బియ్యం, వాటర్ టాప్ లుపరిశీలించారు.